Skip to main content
నవ తరంగాలుSearch
జిల్లా వార్తలుహనుమకొండ

యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు. యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి. హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి. హనుమకొండ గోపాల్ పూర్ లో అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్. మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.

By: DHARAVATH ASHOK·1 min read·3 views
Share:
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

వినూత్న ఉత్పత్తులతో స్వయం ఉపాధికి అవకాశాలు

యువత ప్రభుత్వ ప్రోత్సాహకాలను సద్వినియోగం చేసుకోవాలి

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి

హనుమకొండ గోపాల్ పూర్ లో అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను ప్రారంభించిన జిల్లా కలెక్టర్

మిల్లెట్ ఉత్పత్తులను తయారు చేయడం ద్వారా ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించడంతోపాటు స్వయం ఉపాధి అవకాశాలను మెరుగుపరుచుకోవచ్చని జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్‌పాయి అన్నారు.

ఆదివారం హనుమకొండ గోపాల్ పూర్ జవహర్ కాలనీలో ఐఐఎంఆర్ న్యూట్రి హబ్ ప్రోత్సాహంతో ఉజ్వల చంద్రగిరి అనే యువతి ఎంటర్ప్రెన్యూషిప్ లో భాగంగా నెలకొల్పిన అరిస్సా గ్రోత్ ఫార్మ్స్ మిల్లెట్ పన్నీరు మాన్యూప్యాక్చరింగ్ ప్రాసెసింగ్ యూనిట్ ను జిల్లా కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఉత్పత్తి యూనిట్ కు సంబంధించిన వివరాలను ఎంటర్ప్రెన్యూరర్ ఉజ్వలను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. హనుమకొండలో దేశంలోనే తొలిసారిగా ప్లాంట్‌ బేస్డ్‌ మిల్లెట్‌ పన్నీర్‌ తయారీ యూనిట్‌ ఇది అని, ఈ యూనిట్‌లో పాల ఉత్పత్తులతో కాకుండా మొక్కల నుంచి లభించే ప్రోటీన్‌ను ఉపయోగించి నాన్‌-డెయిరీ మిల్లెట్‌ పన్నీర్‌, మిల్లెట్ బాసుంది తయారు చేస్తామని తెలిపారు. ఆరోగ్యకరమైన, పోషక విలువలతో కూడిన ప్రత్యామ్నాయ ఆహార ఉత్పత్తుల తయారీకి ఈ యూనిట్‌ దోహదపడుతుందన్నారు.ఈ పరిశ్రమ ఏర్పాటుకు హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ (IIMR) ఆర్కేవీవై రాఫ్తార్ కార్యక్రమం ద్వారా స్థాపించినట్లు పరిశ్రమ నిర్వాహకురాలు ఉజ్వల కలెక్టర్ కు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి మాట్లాడుతూ మిల్లెట్ ఆధారిత ఉత్పత్తుల తయారీలో ఐఐఎంఆర్‌ వంటి సంస్థల సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని కొత్త ఉత్పత్తులను అభివృద్ధి చేయాలని సూచించారు. ఆహార శుద్ధి (ఫుడ్ ప్రాసెసింగ్) పరిశ్రమలకు ప్రస్తుతం విస్తృతమైన డిమాండ్ ఉందని, నిరుద్యోగ యువత కొత్త పరిశ్రమల ఏర్పాటుతో స్వయం ఉపాధి సాధించాలని తెలిపారు. మిల్లెట్ ఉత్పత్తుల తయారీ రంగంలో మహిళలు, యువతకు స్వయం ఉపాధి, స్వయం ఆర్థిక సాధికారతకు విస్తృత అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ ప్రోత్సాహకాలు, పథకాలను సద్వినియోగం చేసుకుని ఉపాధి అవకాశాలను సృష్టించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మిల్లెట్‌ రీసెర్చ్‌ న్యూట్రి హబ్ కు చెందిన డాక్టర్‌ జె.స్టాన్లే , జిల్లా పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ నవీన్ కుమార్, న్యూట్రిహబ్‌ బృందం, తదితరులు పాల్గొన్నారు.

Related news

హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి
జిల్లా వార్తలు

ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు

విద్యార్థుల భవిష్యత్తుకు పునాది వేసే ప్రతి టీచర్ ఉత్తములే విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట ప్రభుత్వ ప్రత్యేక చొరవతో మారిన ప్రభుత్వ బడుల రూపురేఖలు హనుమకొండ జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో పాఠశాల విద్యాశాఖ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవ వేడుకలు జిల్లా స్థాయి ఉత్తమ ఉపాధ్యాయులకు ఘన సన్మానం

గుండు సుధారాణి కూడా చైర్మన్
జిల్లా వార్తలు

బాధ్యతలు స్వీకరించిన గుండు సుదారాణి

కుడా ఛైర్‌పర్సన్‌గా బాధ్యతలు స్వీకరించిన గుండు సుదారాణి పుష్పగుచ్చాలు అందించి శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, రేవూరి ప్రకాష్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు,జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి

గుండు సుధారాణి కూడా చైర్మన్
జిల్లా వార్తలు

రేవంత్ రెడ్డికి గుండు సుధారాణి కృతజ్ఞతలు

తనను కుడా చైర్‌పర్సన్‌గా నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసినందుకు ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారికి గుండు సుధారాణి హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలిపారు.